తెలంగాణ

telangana

ETV Bharat / city

క్రిస్టియన్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కొప్పుల - మంత్రి కొప్పుల ఈశ్వర్

క్రిస్టియన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ విశేష ప్రాధాన్యతనిస్తోందని షెడ్యూల్​ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు. గండిపేట సమీపంలోని కోకాపేటలో నిర్మిస్తున్న క్రిస్టియన్​ భవన నిర్మాణ నమూనాలను  అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులు వీలైనంత తొందరగా ప్రారంభించాలని ఆదేశించారు.

minister koppula eshwar checked christian building plan
క్రిస్టియన్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కొప్పుల

By

Published : Oct 15, 2020, 9:08 AM IST


గండిపేట సమీపంలోని కోకాపేటలో నిర్మిస్తున్న క్రిస్టియన్​ భవన నిర్మాణ నమూనాలను మంత్రి కొప్పుల ఈశ్వర్​ పరిశీలించారు. పవర్​పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా భవన నమూనాను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ల, మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. క్రిష్టియన్​ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 10 కోట్లు వెచ్చించిందని తెలిపారు.

అన్ని సౌకర్యాలతో సుమారు 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేయనున్నట్టు మంత్రి వివరించారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌, మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌, ఉన్నతాధికారులు షానవాజ్‌ ఖాసీం, కాంతివెస్లీ తదితరులు పాల్గొన్నారు.

ఇవీచూడండి:కుండపోత వర్షంతో అతలాకుతలమైన జంటనగరాలు

ABOUT THE AUTHOR

...view details