ఉద్యోగుల ఐఆర్, ఫిట్మెంట్ అంశాన్ని సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. గతంలో 42 శాతం ఫిట్మెంట్ అడిగితే 43 శాతం ఇచ్చినట్లు గుర్తు చేశారు. కార్పొరేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రత్యేక హెల్త్ పాలసీ తీసుకువచ్చినట్లు వెల్లడించారు. సచివాలయంలోని దస్త్రాల తరలింపుపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. ఉద్యోగుల వ్యక్తిగత రిజిస్టర్లో పొందుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. దస్త్రాలు మారే అవకాశం లేదని మంత్రి వివరించారు.
'అడిగిన దానికంటే... ఇంకోశాతం ఎక్కువే ఇచ్చాం' - మంత్రి హరీశ్ రావు
గత ప్రభుత్వాలు పొరుగుసేవల ఉద్యోగులను వెట్టిచాకిరీ చేయించుకున్నాయని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, కాంట్రాక్టు, పొరుగుసేవ ఉద్యోగుల వేతనాలను తెరాస ప్రభుత్వం పెంచిందని గుర్తుచేశారు. అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

harish rao
వాళ్లు అడిగినదానికంటే ఒక శాతం ఎక్కువే ఇచ్చాం: మంత్రి హరీశ్
ఇదీ చూడండి: 'పురపాలక' బిల్లుకు శాసనసభ ఆమోదం