తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్​పీసీఐ డేటా కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

By

Published : Jul 2, 2020, 4:59 PM IST

Updated : Jul 2, 2020, 7:29 PM IST

Minister for the establishment of NCPI Data Center KTR
ఎన్​పీసీఐ డాటాకేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

16:52 July 02

ఎన్​పీసీఐ డేటా కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

ఎన్​పీసీఐ డేటా కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్​లో ఏర్పాటు చేయనున్న డేటాకేంద్రానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రిటైల్ లావాదేవీలు, డిజిటల్ పేమెంట్ల కోసం ఎన్​పీసీఐ అంతర్జాతీయ డేటా కేంద్రం ప్రమాణాలతో రూ.500 కోట్లతో నార్సింగిలో స్మార్ట్ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇది హైదరాబాద్​లో మొదటి టైర్ ఫోర్ డేటా కేంద్రం. డిజిటల్ ఇండియాలో భాగంగా స్మార్ట్ డేటా కేంద్రాన్ని ఎన్​పీసీఐ అభివృద్ధి చేయనుంది. నెలకు 4 వేల మిలియన్ల సంఖ్యలో రూ.15 లక్షల కోట్ల వరకు డిజిటల్ చెల్లింపుల ప్రాసెసింగ్​లో డేటా కేంద్రం కీలకం కానుందని తెలిపింది.

భూకంపాలు, తుపాన్ల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి భద్రతా ప్రమాణాలతో పూర్తి పర్యావరణహితంగా డేటా కేంద్రం నిర్మాణం చేయనున్నారు. ఎనిమిదంచెల భద్రతతో ఐఓటీ ఆధారిత భవన నిర్వహణా వ్యవస్థతో రూపుదిద్దుకోనుంది. డేటా కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్​కు కార్పొరేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 

ఇదీ చూడండి :మార్కెట్​లోకి సరికొత్త ఛాలెంజ్​... ఇది పర్యావరణహితమండోయ్​..!

Last Updated : Jul 2, 2020, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details