ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఏర్పాటుచేసి తీరతామని.. ఆ ప్రక్రియలోనే ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే 3 రాజధానుల నిర్ణయమని పేర్కొన్నారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతాం: బొత్స - మూడు రాజధానులపై మంత్రి బొత్స కామెంట్స్
మూడు రాజధానులు తమ విధానమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కోర్టును ఒప్పించి, వాస్తవాలు చెబుతామని.. సమస్యలు అధిగమిస్తామన్నారు.
బొత్స సత్యనారాయణ
మిగిలిన 32 పురపాలికలు, 3 నగరపాలికలకు త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. విలీన గ్రామాలను కలిపి రాజమహేంద్రవరం నగరపాలికకు ఎన్నికలు జరుగుతాయని మంత్రి వెల్లడించారు. రాజమహేంద్రవరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి :యాదాద్రి ఆలయంలో మరో 32 మంది సిబ్బందికి కరోనా