తెలంగాణ

telangana

By

Published : Jan 17, 2022, 5:14 PM IST

ETV Bharat / city

'విద్యాసంస్థలు తెరిచాం.. విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన అక్కర్లేదు'

Schools open after Sankranti: సంక్రాంతి పండుగ అయిపోయిందో లేదో.. ఇటు విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. విద్యార్థుల రోజువారీ హాజరు కూడా తీసుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ స్పష్టం చేశారు.

minister-adimulapu-suresh-on-schools-open
minister-adimulapu-suresh-on-schools-open

Schools open after Sankranti: సంక్రాంతి సెలవుల తర్వాత విద్యాసంస్థలు మొదలయ్యాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. విద్యార్థుల రోజువారీ హాజరు తీసుకుంటున్నామని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదని.., పరీక్షలు నిర్వహించేలా పాఠశాలల్లో బోధన జరుగుతోందన్నారు. కొవిడ్ వల్ల గత రెండేళ్లుగా ఆల్ పాస్ విధానం అనుసరించామని.. భవిష్యత్తులో విద్యార్థులకు ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదన్నారు.

26 లక్షల మంది విద్యార్థుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్ పూర్తిచేసినట్లు మంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయులకు కూడా కొవిడ్ వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామన్నారు. కొవిడ్ దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూనే బోధన జరుగుతుందన్నారు. గత 150 రోజులుగా నిరంతరాయంగా పాఠశాలలు నడిచాయని.., విద్యా సంవత్సరం నష్టపోవద్దనే పాఠశాలల నిర్వహిస్తున్నామని తెలిపారు. కొవిడ్ వ్యాప్తికి పాఠశాలల నిర్వహణకు సంబంధం లేదన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

పొరుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు రద్దుచేస్తే.. జాగ్రత్తలతో ఏపీలో నిర్వహించామని గుర్తు చేశారు. ఆన్‌లైన్ విద్యా బోధనకు పరిమితి ఉందని.., ప్రాథమిక, మాధ్యమిక విద్యకు ఆన్‌లైన్‌ ప్రత్యామ్నాయం కాదన్నారు. విద్యార్థులు క్యారియర్లు అయినా.. వారికి వ్యాక్సిన్ వేస్తున్నామని చెప్పారు. అత్యవసర స్థితుల్లో నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే 30 శాతం సిలబస్ పూర్తి చేసినట్లు మంత్రి సురేశ్‌ వెల్లడించారు.

"విద్యార్థుల రోజువారీ హాజరు తీసుకుంటున్నాం. విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదు. పరీక్షలు నిర్వహించేలా పాఠశాలల్లో బోధన జరుగుతోంది. 26 లక్షల మంది విద్యార్థుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్ పూర్తి చేశాం. ఉపాధ్యాయులకు కూడా కొవిడ్ వ్యాక్సినేషన్‌ పూర్తి చేశాం. కొవిడ్ దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూనే బోధన జరుగుతుంది. 150 రోజులు నిరంతరాయంగా పాఠశాలలు నడిచాయి. కొవిడ్ వ్యాప్తికి పాఠశాలల నిర్వహణకు సంబంధం లేదు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే తగిన నిర్ణయం తీసుకుంటాం." -ఆదిమూలపు సురేశ్‌, ఏపీ విద్యాశాఖ మంత్రి

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details