తెలంగాణ

telangana

By

Published : Aug 28, 2020, 5:56 PM IST

Updated : Aug 28, 2020, 6:52 PM IST

ETV Bharat / city

'కరోనాపై పోరులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ విరాళం​'

కొవిడ్​పై పోరులో భాగంగా రూ.3.8 కోట్ల విలువైన వైద్య ఉపకరణాలను ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఇందుకు సంబంధించిన విరాళాన్ని మైక్రోసాఫ్ట్ ఎండీ రాజీవ్ కుమార్.. మంత్రి కేటీఆర్​కు అందజేశారు.

Microsoft India  for donating medical equipment worth Rs 3.8 Crores to  ts govt.
'కరోనాపై పోరులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ విరాళం​'

కొవిడ్​పై పోరులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3.8 కోట్ల విలువైన వైద్య ఉపకరణాలను విరాళంగా ఇచ్చేందుకు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన విరాళాన్ని మైక్రోసాఫ్ట్ ఎండీ రాజీవ్ కుమార్.. మంత్రి కేటీఆర్​కు అందజేశారు. కొవిడ్ మహమ్మారి నిర్ధరణ కొరకు.. 14 హై పర్ఫామెన్స్ టెస్టింగ్ కిట్స్​ను మైక్రోసాఫ్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. తద్వారా రాష్ట్రంలో రోజుకు 3500 పరీక్షలు అదనంగా చేసే వీలు కలుగుతుంది.

రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు.. వైద్య ఉపకరణాలను విరాళంగా ఇచ్చిన సంస్థ చొరవను మంత్రి కేటీఆర్ అభినందించారు.


ఇవీ చూడండి:పరీక్షల వాయిదా కోసం కాంగ్రెస్​ నిరసనలు

Last Updated : Aug 28, 2020, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details