తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2019, 4:23 AM IST

Updated : Sep 23, 2019, 7:21 AM IST

ETV Bharat / city

ప్రమాదంపై స్పందించిన మెట్రో ఎండీ

అమీర్​పేట మెట్రో స్టేషన్​ కింద జరిగిన ప్రమాదంపై మెట్రో ఎండీ స్పందించారు. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించి, పరిష్కార చర్యలు తీసుకోవడానికకి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

ప్రమాదంపై స్పందించిన మెట్రో ఎండీ

అమీర్‌పేట మెట్రో స్టేషన్ కింద జరిగిన ప్రమాదంపై​ ​మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. మెట్రోస్టేషన్ పై నుంచి పెచ్చులు ఊడిపడిన శకలాలతో ​​ఒక యువతి ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. అంత పైనుంచి ​ఆమె తలపై నేరుగా పడడం మరణానికి కారణమైందన్నారు. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన పరిష్కార చర్యలు తీసుకోవడానికి స్వతంత్ర దర్యాప్తు చేస్తామని చెప్పారు. ప్రమాదాలు​ నివారించడానికి అన్ని మెట్రో స్టేషన్ స్తంభాలతో పాటు ఉపరితలాలను పూర్తిగా తనిఖీ చేయమని ఎల్ అండ్ టీకి సూచించామని తెలిపారు.

ప్రమాదంపై స్పందించిన మెట్రో ఎండీ
Last Updated : Sep 23, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details