Mekapati Raja Mohan Reddy:ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వంద ఎకరాల్లో స్థాపించిన రూ.225 కోట్ల విలువైన మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను, అందులోని భవనాలను, ఇతరత్రా ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తెలిపారు. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉదయగిరికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆయన ఏకాంతంగా సంభాషించారు.
'రూ.225 కోట్ల ఆస్తులిస్తాం... మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు చేయండి' - మేకపాటి గౌతమ్ రెడ్డి
Mekapati Raja Mohan Reddy : ఉదయగిరిలో స్థాపించిన రూ.225 కోట్ల విలువైన మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. తండ్రి తెలిపారు. ఆ కళాశాలలోనే మేకపాటి గౌతంరెడ్డి పేరిట వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ తక్షణమే చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలిసింది.

మేకపాటి రాజమోహన్ రెడ్డి
తాము స్వాధీనం చేసే కళాశాలలోనే మేకపాటి గౌతంరెడ్డి పేరిట వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, గౌతంరెడ్డి ఆశయమైన సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-1, ఫేజ్-2 పనులను పూర్తి చేయాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
ఇదీ చదవండి:ఒడిశా మాజీ సీఎం కన్నుమూత.. ప్రముఖుల సంతాపం