తెలంగాణ

telangana

ETV Bharat / city

మొక్కలే ఆయనకు ప్రాణం... 35 ఏళ్లుగా వాటితోనే ప్రయాణం - nellore latest news

మొక్కలంటే ఆయనకు చాలా ప్రేమ. 35 ఏళ్లుగా ఓ మహాయజ్ఞంలా మొక్కలను పెంచుతున్నారు. దీని కోసం ఏకంగా 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. విదేశాల నుంచి మొక్కలకు పోషక ఎరువులు తెప్పిస్తున్నారు. ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ మొక్కల పెంపకానికి రోజూ 5 గంటలు కేటాయిస్తారు.

plant lover

By

Published : Oct 22, 2019, 5:34 AM IST

మొక్కలే ఆయనకు ప్రాణం... 35 ఏళ్లుగా వాటితోనే ప్రయాణం

నెల్లూరు నగరంలోని జగదీశ్​ నగర్​కు చెందిన చంద్రశేఖర్​కు మొక్కలంటే పంచప్రాణాలు. 265 చదరపు గజాల ఇంటిలోనే 2000 మొక్కలు పెంచుతూ ఉద్యానవనంలా మార్చేశారు. దేశవిదేశాల నుంచి మొక్కలు తెప్పించుకుని అపురూపంగా చూసుకుంటున్నారు. విద్యాశాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నప్పటికీ మొక్కల పెంపకానికి రోజులో 5 గంటల సమయం కేటాయిస్తారు. 35 ఏళ్లుగా తమకు ఇది నిత్యకృత్యమని ఆయన అంటున్నారు.

మొక్కలకుదేశ విదేశాల నుంచిఎరువులు

చంద్రశేఖర్ తన ఇంట్లో మొత్తం 200 రకాలు మొక్కలు పెంచుతున్నారు. నీటితామర, సువాసనలు వెదజల్లే అజేలియా పుష్పాలు, థాయ్​ల్యాండ్, జపాన్, హవాయి ద్వీపాల నుంచి తెచ్చిన మెుక్కలు, ఎడారి మొక్కలు, మరుగుజ్జు చెట్లు ఇలా వివిధ రకాల మొక్కలతో ఇంటిని నింపేశారు. వీటిని సంరక్షించుకోవడానికి చంద్రశేఖర్ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఆన్ లైన్ ద్వారా పోషక ఎరువులు తెప్పిస్తారు. కేరళ విధానంలో కొబ్బరి పొట్టు కలిపిన ఎరువులు వేస్తున్నారు.

చంద్రశేఖర్​తోపాటు ఆయన సతీమణి రాజేశ్వరికీ మొక్కల పెంపకమంటే ఆసక్తి. వీరి పిల్లలు బెంగళూరులో ఉంటున్నారు. వీరు మాత్రం మొక్కలను వదిలి ఎక్కడికీ వెళ్లరు... అవే వీరికి ప్రాణం. మొక్కల కోసం రూ.20 లక్షల వరకు ఖర్చు చేశారు. రూ.10 వేల వరకు అద్దె వచ్చే పై అంతస్తుని మొక్కల కోసం ఖాళీగా ఉంచారు. తన సోదరి హనుమాయమ్మ హైదరాబాద్​లోని ఇంటిలో 10వేల మొక్కలు పెంచిందని... ఆమే తనకు ఆదర్శమని చంద్రశేఖర్ అంటున్నారు.

ఆరోగ్యం... ఆనందం
ప్రతి ఇంటిలో మొక్కలు పెంచితే కాలుష్యాన్ని నివారించవచ్చునని చంద్రశేఖర్ చెబుతున్నారు. ప్రతి రోజు పెరటిలో మొక్కల కోసం పనిచేస్తే ఆరోగ్యంతోపాటు, మానసికంగా ఆనందం కలుగుతుందని అంటున్నారు. ఎటువంటి వ్యాధుల్లేవని గర్వంగా చెబుతున్నారీ 58ఏళ్ల మొక్కల ప్రేమికుడు.

ఇదీ చూడండి: కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు నిధుల్లేవు: ఆర్టీసీ యాజమాన్యం

ABOUT THE AUTHOR

...view details