కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదిగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి, ఎంపీ, ఆర్టీసీ ఛైర్మన్గా.. ఆయన ప్రత్యేక శైలి కనబరిచారన్నారు. రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారని సీఎం గుర్తు చేసుకున్నారు. దివంగత ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ .. ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఎమ్మెస్సార్ మరణం పట్ల మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్రాష్ట్రవ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎమ్మెస్సార్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఆయన మరణం కాంగ్రెస్కు తీరని లోటన్నారు. ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానం శ్మశాన వాటికలో ఎమ్మెస్సార్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.