అమీర్పేట.. తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల పల్లెల నుంచి సైతం వేల మంది యువతీ యువకులు ఇక్కడికి తరలివచ్చేవారు. విదేశీ కొలువులు, విద్యాసంస్థల్లో సీట్ల సాధనకు తమ నైపుణ్యాన్ని పెంచుకునేందుకు వివిధ కోర్సుల్లో శిక్షణకు చేరేవారు. ప్రైవేటు వసతిగృహాల్లో ఉంటూ.. తాత్కాలిక ఉద్యోగాలు చేసుకుంటూ శిక్షణ పొందేవారు.
కొవిడ్ ఎఫెక్ట్... యువత కలల సౌధం కళ తప్పింది! - maitrivanam ameerpet roads are empty
కరోనా వైరస్ ప్రభావం విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యార్థులతో కళకళలాడే పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు మహమ్మారి వల్ల వెలవెలబోతున్నాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ల సంగతి ఇక చెప్పక్కర్లేదు. భాగ్యనగరంలో యువత కలల సౌధం.. వివిధ కోర్సుల కల్పతరువు అమీర్పేట మైత్రీవనం కొవిడ్ 19 వల్ల విద్యార్థుల లేక కళతప్పింది.
![కొవిడ్ ఎఫెక్ట్... యువత కలల సౌధం కళ తప్పింది! maitrivanam ameerpet roads are empty due to corona crisis](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8175671-599-8175671-1595731585595.jpg)
బోసిపోయిన అమీర్పేట మైత్రీవనం
అమీర్పేట మైత్రీవనం పరిసరాల్లోని రహదారులు ఉత్సాహం ఉరకలెత్తే యువతీ యువకులతో కిటకిటలాడేవి. కరోనా మహమ్మారి కారణంగా శిక్షణ సంస్థలు, వసతిగృహాలు మూతపడ్డాయి. తాత్కాలిక కొలువులూ పోయాయి. యువత సొంతూళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం అమీర్పేట ఇలా బోసిపోతోంది. కరోనా ఉద్ధృతి తగ్గి మళ్లీ కళకళలాడే రోజుల కోసం ఇక్కడి శిక్షణ సంస్థలు ఎదురుచూస్తున్నాయి.