కూకట్పల్లిలో వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడి కక్కడే మృతిచెందాడు.
చైతన్య కళాశాల నీటి ట్యాంకర్ బీభత్సం.. ఒకరు దుర్మరణం - నారాయణ కళాశాల ఉద్యోగి మృతి
కూకట్పల్లిలో వసంత నగర్లో ద్విచక్రవాహనాన్ని నీటి ట్యాంకర్ ఢీ కొన్న ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
![చైతన్య కళాశాల నీటి ట్యాంకర్ బీభత్సం.. ఒకరు దుర్మరణం lorry hits a bike one man died at the spot in kukatpally hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5190712-1063-5190712-1574838181688.jpg)
చైతన్య కళాశాల నీటి ట్యాంకర్ బీభత్సం.. ఒకరు దుర్మరణం
వసంత నగర్లో ఉంటున్న ఖాసీం.. నారాయణ కాలేజీలో పనిచేస్తున్నాడు. ఇవాళ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. చైతన్య కళాశాలకు చెందిన నీటి ట్యాంకర్ బలంగా ఢీ కొంది. సుమారు 20 అడుగుల వరకు మృతదేహాన్ని ఈడ్చుకుపోయింది. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
చైతన్య కళాశాల నీటి ట్యాంకర్ బీభత్సం.. ఒకరు దుర్మరణం
ఇవీచూడండి: టైర్ పంక్చరై అదుపు తప్పిన బస్సు.. ఇద్దరికి అస్వస్థత