అహోబిలం రహదారిపై చిరుత బైఠాయించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. సోమవారం రాత్రి అహోబిలం సమీపంలోని దుర్గమ్మ గుడి వద్ద ప్రధాన రహదారిపై చిరుత బైఠాయించింది. దీంతో రెండు వైపులా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
అహోబిలం రహదారిపై అడ్డంగా కూర్చున్న చిరుత - leopard at ahobilam
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ-అహోబిలం రహదారిలో సోమవారం రాత్రి చిరుత సంచరించింది. దుర్గమ్మ గుడి వద్ద తెలుగుగంగ కాల్వ వంతెన దాటగానే ఉన్న రహదారిపై అడ్డంగా కూర్చొంది.
![అహోబిలం రహదారిపై అడ్డంగా కూర్చున్న చిరుత chirutha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7537560-938-7537560-1591676456967.jpg)
chirutha
చాలాసేపు అలాగే ఉండిపోయిన చిరుత... తర్వాత తాపీగా అటవీ ప్రాంతంలోకి వెళ్లి పోయింది. ఈ ప్రాంతం చుట్టూ నల్లమల అటవీ ప్రాంతం ఉండటంతో తరచూ అటవీ జంతువులు బయటికువచ్చి అహోబిలం దేవస్థానం సమీపంలో తిరుగుతుంటాయి.
అహోబిలం రహదారిపై అడ్డంగా కూర్చున్న చిరుత
Last Updated : Jun 9, 2020, 9:52 AM IST