ఆంధ్రప్రదేశ్లో కరోనా పరీక్షల సంఖ్య 80 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 82,045 కరోనా పరీక్షలు నిర్వహించగా .. 2,783 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్తో మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,23,348కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,690 మంది కొవిడ్తో మృతి చెందారు.
గడిచిన 24 గంటల్లో 3,708 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,92,083కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,575 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 80,28,905 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది.