తెలంగాణ

telangana

ETV Bharat / city

పన్ను తీస్తుంటే...ప్రాణం పోయింది!

పాడైన పన్నును తొలగిస్తుండగా ఓ మహిళ మృతి చెందింది. అయ్యో పాపం అనిపించే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది.

By

Published : Nov 8, 2019, 2:39 PM IST

Updated : Nov 8, 2019, 3:03 PM IST

పన్ను తీస్తుంటే...ప్రాణం పోయింది!

పన్ను తీస్తుంటే...ప్రాణం పోయింది!
ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. పాడైన పన్నును తొలగిస్తుండగా ఓ మహిళ మృతి చెందింది. కామవరపుకోట మండలం అంకాలగూడెంకు చెందిన నిజవరపు సావిత్రి పన్ను నొప్పితో బాధపడుతూ... జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు దంత వైద్యశాలను సంప్రదించింది. పన్ను పాడైందనీ, తొలగించాలని వైద్యులు సూచించారు. పన్ను తొలగిస్తుండగా ఆమె మృతి చెందింది.

వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ... ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆమె ఆందోళనకు గురవ్వటం వల్ల గుండె పోటు వచ్చి మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Nov 8, 2019, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details