తెలంగాణ

telangana

By

Published : Jun 10, 2019, 4:19 PM IST

ETV Bharat / city

పీఎఫ్​ కార్యాలయాల వద్ద ఏఐటియూసీ నిరసన

కార్మికులకు పీఎఫ్​, ఈఎస్​ఐలను సకాలంలో చెల్లించడం లేదంటూ కార్మిక సంఘాల నేతలు నిరసనకు దిగారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యనిధి కార్యాలయాల ముందు కార్మికసంఘాల నేతలు నిరసన చేపట్టారు.

పీఎఫ్​ కార్యాలయాల వద్ద కార్మిక సంఘాల నిరసన

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భవిష్యనిధి కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టారు కార్మిక నేతలు. ఇవాళ సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని భవిష్యనిధి ప్రాంతీయ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కమిషనర్​కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన తీసుకోకపోవడం వల్ల ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా కార్మికుల పీఎఫ్​, ఈఎస్​ఐ పెండింగ్​ మొత్తాలను సకాలంలో పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు భీమ్ రావ్​ పాటిల్ హెచ్చరించారు.

పీఎఫ్​ కార్యాలయాల వద్ద కార్మిక సంఘాల నిరసన

ABOUT THE AUTHOR

...view details