తెలంగాణ

telangana

By

Published : Nov 19, 2019, 6:50 PM IST

Updated : Nov 20, 2019, 12:32 AM IST

ETV Bharat / city

ప్రశాంత్​ తండ్రితో ఫోన్​లో మాట్లాడిన మంత్రి కేటీఆర్​

పాక్​ చెరలో ఉన్న ప్రశాంత్​ను దేశానికి రప్పించే బాధ్యతను తాము తీసుకుంటామని కూకట్​పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు హామీ ఇచ్చారు. ప్రశాంత్​ తండ్రి బాబురావును పరామర్శించి ధైర్యం చెప్పారు. బాబురావుతో మంత్రి కేటీఆర్​ ఫోన్​లో మాట్లాడారు.

ప్రశాంత్​ తండ్రితో ఫోన్​లో మాట్లాడిన మంత్రి కేటీఆర్​

హైదరాబాద్​ కూకట్​పల్లిలోని కేపీహెచ్​బీ కాలనీ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి పాకిస్థాన్ పోలీసుల చేతిలో ఇరుకున్న విషయం తెలిసిందే. కూకట్​పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ప్రశాంత్ ఇంటికి వెళ్లి అతని తండ్రి బాబురావును పరామర్శించారు. మంత్రి కేటీఆర్​తో ఫోన్​లో మాట్లాడించారు.

ప్రశాంత్​ను దేశానికి రప్పించే బాధ్యతను తాము తీసుకుంటామని ఎమ్మెల్యే కృష్ణారావు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఇప్పటికే ప్రశాంత్​ను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కృష్ణారావు తెలిపారు.

ప్రశాంత్​ తండ్రితో ఫోన్​లో మాట్లాడిన మంత్రి కేటీఆర్​

ఇవీ చూడండి: "ప్రశాంత్ ప్రేమ విఫలమై డిప్రెషన్​లో ఉన్నాడు"

Last Updated : Nov 20, 2019, 12:32 AM IST

ABOUT THE AUTHOR

...view details