తెలంగాణ

telangana

'ఈటీవీకి పాతికేళ్ల పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్​'

By

Published : Aug 28, 2020, 8:56 PM IST

ఈటీవీ పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న శుభసందర్భంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌.. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు శుభాకాంక్షలు తెలిపారు. పాతికేళ్ల ప్రస్థానంలో ఈటీవీ అనుసరించిన విధానాలు, విలువలు కొనసాగిస్తూ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, వీక్షకుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

ktr wishes to etv 25 years celebrations
'ఈటీవీకి పాతికేళ్ల పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్​'

ఈటీవీ పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న శుభసందర్భంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌.. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు శుభాకాంక్షలు తెలిపారు. వినోదం, విజ్ఞానం, ఆరోగ్యం లాంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చి ఈటీవీని ప్రజల టీవీగా మలిచారని... కొనియాడారు.

ఈటీవీకి పాతికేళ్ల పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్​

వైవిద్యభరిత కార్యక్రమాలు, ధారావాహికలు, షోలతో ఈటీవీ తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిందన్న ఆయన... తెలుగుభాషాభివృద్ధికి చేస్తున్న సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. పాతికేళ్ల ప్రస్థానంలో ఈటీవీ అనుసరించిన విధానాలు, విలువలు కొనసాగిస్తూ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, వీక్షకుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

ఇవీ చూడండి:'ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details