తెలంగాణ

telangana

'ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం'

By

Published : Aug 28, 2020, 2:47 PM IST

Updated : Aug 28, 2020, 3:40 PM IST

ktr review on basti dhawakana
'ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం'

14:43 August 28

'ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం'

బస్తీ దవాఖానాలపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కేంద్రాలతో పేదలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మరో వంద బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  

ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతమయ్యాయి. ఈ కేంద్రాల ద్వారా రోజూ 25 వేల మందికి ఓపీ వైద్య సేవలందించాలి. నగరంలో 197 బస్తీ దవాఖానాలు, పీహెచ్‌సీల ద్వారా రోజుకు 5 వేల పరీక్షలు చేయాలి. ప్రతిరోజూ 53 రకాల పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్ వంటి వైద్య పరీక్షలు నిర్వహించాలి. బస్తీ దవాఖానాలకు పేదల నుంచి మంచి స్పందన వస్తుంది. ఒకట్రెండు నెలల్లో మరో వంద బస్తీ దవాఖానాలు ప్రారంభమవ్వాలి. -  కేటీఆర్​, ఐటీ, పురపాలక శాఖ మంత్రి.

 సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, అన్ని జిల్లాల కలెక్టర్లు, పురపాలకశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు హాజరయ్యారు.

ఇవీ చూడండి:హరితవనంగా గ్రేటర్​ హైదరాబాద్​: మేయర్​ బొంతురామ్మోహన్​

Last Updated : Aug 28, 2020, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details