తెలంగాణ

telangana

ETV Bharat / city

నీటి విడుదలకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఉత్తర్వులు...

రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 5న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటి కేటాయింపులు జరిపారు. మార్చి 31 నాటికి నీటిని కేటాయించేందుకు కేఆర్​బీఎం అనుమతినిచ్చింది.

By

Published : Feb 12, 2021, 4:39 PM IST

krishna river board gave water allotments
krishna river board gave water allotments

తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు 82.02 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్​కు 92.50 టీఎంసీలు కేటాయించింది. మార్చి 31 నాటికి నీటిని కేటాయించేందుకు కేఆర్​బీఎం అనుమతినిచ్చింది. ఈనెల 5న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటి కేటాయింపులు జరిపారు.

తెలంగాణకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 17.92 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 65 టీఎంసీల నీటిని విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్​కు శ్రీశైలం ప్రాజెక్ట్​ నుంచి 27.90 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 64.60 టీఎంసీల విడుదలకు అనుమతినిచ్చింది.

ఇదీ చూడండి:కిడ్నీని అమ్మకానికి పెట్టిన బస్​ కండక్టర్!

ABOUT THE AUTHOR

...view details