తెలంగాణ

telangana

By

Published : Jul 19, 2021, 5:12 PM IST

ETV Bharat / city

Kollu ravindra: 'నిరుద్యోగుల కడుపుమంట జగన్​కు కనిపించట్లేదా?'

నిరుద్యోగులకు సమాధానం చెప్పలేకే వాళ్లను బలవంతంగా అరెస్టు చేస్తున్నారని ఏపీ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా నిరుద్యోగులు తాడేపల్లికి చేరుకున్నారంటే వారి కడుపుమంట ఎలా ఉందో గ్రహించాలని హితవు పలికారు.

kollu ravindra
కొల్లు రవీంద్ర

'మాట తప్పను మడమ తిప్పను' అన్న వైఎస్​ జగన్.. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని ఏపీ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా నిరుద్యోగులు తాడేపల్లికి చేరుకున్నారంటే వారి కడుపుమంట ఎలా ఉందో గ్రహించాలని హితవు పలికారు.

'సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునివ్వడంతో ముఖ్యమంత్రి జగన్.. పిరికితనంతో ఇంటి చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టుకున్నారు. సమాధానం చెప్పలేకే నిరుద్యోగులను బలవంతంగా అరెస్టు చేస్తున్నారు. 2.30 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పిన సీఎం జగన్​.. ఇప్పుడు కేవలం 10వేల ఉద్యోగాలతో క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న వాళ్లు తీవ్ర అందోళనలో ఉన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్​ను రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.3 లక్షల ఖాళీలతో నూతన క్యాలెండర్ విడుదల చేయాలి.' కొల్లు రవీంద్ర, తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యులు

ఇదీ చదవండి:Aashaadha saare: ఆషాడ సారె కావిడి.. టన్నుల కొద్దీ ఎప్పుడైనా చూశారా..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details