హైదరాబాద్లో నిర్వహించిన "కాశ్మీర్ ఆన్ కాన్వాస్" చిత్రకళా ప్రదర్శనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ స్టేట్ గ్యాలరీ ప్రదర్శన రేపటి వరకు నిర్వహించనున్నారు. రెండు దశాబ్దాలకు పైగా కాశ్మీర్ లోయలో గడిపిన అనుభవాలు, అక్కడి అందాలను చిత్రీకరించినట్లు శిరీష తెలిపారు. వీటి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంను జమ్మూ కాశ్మీర్ పోలీసుల అమరవీరుల కుటుంబాలకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
విశేషంగా ఆకట్టుకుంటున్న "కాశ్మీర్ ఆన్ కాన్వాస్"
భాగ్యనగరంలో నిర్వహించిన "కాశ్మీర్ ఆన్ కాన్వాస్" చిత్రకళా ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమానికి మాజీ డీజీపీ అనురాగ్ శర్మ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.
విశేషంగా ఆకట్టుకుంటున్న "కాశ్మీర్ ఆన్ కాన్వాస్"