ఏపీలో మరో ఎస్సీ వ్యక్తిపై దాడి జరిగింది. బాధ్యాతాయుతమైన ఉద్యోగంలో ఉన్న సీఐ.. బూటు కాలితో ఎస్సీ వ్యక్తిని తన్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జరిగింది. చుట్టూ పెద్ద మనుషులు ఉన్నా ఒక్కరూ పట్టించుకోలేదు.
పలాస మండలం టెక్కలిపట్నంకు చెందిన ఎస్సీ వ్యక్తి ఇంటి స్థలంపై గత 5 రోజులుగా వివాదం జరుగుతోంది. తనకు న్యాయం చేయాలని కాశీబుగ్గు పోలీస్ స్టేషన్కు వచ్చి.. సీఐకు పరిస్థితిని వివరిస్తుండగా.. సీఐ వేణుగోపాల్ ఆ వ్యక్తిపై తన ప్రతాపం చూపాడు. బూటు కాలితో తన్ని.. దాడికి దిగాడు. పక్కనే ఉన్న బాధితుడి తల్లి... సీఐ నుంచి తన కుమారుడుని కాపాడుకునేందుకు ప్రయత్నించింది. చుట్టూ పెద్ద మనుషులు ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకో లేదు. బాధితుడు ఏడుస్తున్నా.. సీఐ కనికరం చూపలేదు.