తిరుమలకు భక్తులతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 1977లో... చిత్తూరు జిల్లా ఏ.రంగంపేట సమీపంలో కల్యాణి డ్యాం నిర్మించారు. 12వేల ఎకరాల విస్తీర్ణంలో 900 అడుగుల నీటిమట్టంతో 31 వేల క్యూసెక్కుల నీరు నిల్వ ఉండేలా జలాశయాన్ని నిర్మించారు. 1600 అడుగుల పొడవుతో మూడు స్పిల్ వే గేట్లు ఏర్పాటు చేశారు.
దిగువకు నీటి విడుదల చేసే సమయంలో ఆ దృశ్యాలు కనులవిందుగా ఉంటాయి. నివర్ తుపాను సహా ఇటీవల భారీ వర్షాలకు జలాశయం నిండడం వల్ల ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఆ దృశ్యాలను చూసేందుకు వచ్చిన సందర్శకులు ఉల్లాసంగా గడిపామని చెబుతున్నారు.