తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయంలోని కల్యాణమండపంలో నిర్వహించిన కల్పవృక్ష వాహన సేవలో.. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు దర్శనమిచ్చారు.
చర్నాకోలా, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.