తెలంగాణ

telangana

ETV Bharat / city

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయ్​సేన్ రెడ్డి ప్రమాణం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నూతనంగా నియమితులైన జస్టిస్ విజయ్​సేన్ రెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఆర్​ఎస్​ చౌహాన్​ విజయసేన్​ రెడ్డితో ప్రమాణం చేయించారు.

By

Published : May 2, 2020, 12:41 PM IST

Updated : May 3, 2020, 6:10 AM IST

justice vijayasen reddy take oath as high court judge
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్ రెడ్డి ప్రమాణం

హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్​సేన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ప్రమాణం చేయించారు. పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. విజయసేన్ రెడ్డి నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కి చేరింది.

విజయ్​సేన్ రెడ్డి మద్రాస్, కేరళ హైకోర్టులకు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుమారుడు. విజయ్ సేన్ రెడ్డి 1970, ఆగస్టు 22న జన్మించారు. హైదరాబాద్​ పీఆర్​ఆర్​ లా కళాశాలలో న్యాయవాద విద్య పూర్తి చేశారు. 1994 డిసెంబరు నుంచి హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్ రెడ్డి ప్రమాణం

ఇదీ చూడండి:హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి నియామకం

Last Updated : May 3, 2020, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details