ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు భవానిపురానికి చెందిన ఏసుదీయమ్మ అనే మహిళకు ముగ్గురు సంతానం. కొంత కాలం క్రితం భర్త చనిపోయాడు. కూలీ పని చేసుకుంటూ ఇద్దరు పిల్లలకు పెళ్లి చేసి... మూడో కుమారుడు కమల్ని బీటెక్ చదివించింది. కమల్కు ఉద్యోగం లేకపోవడంతో తెలిసినవారిని సంప్రదించింది. ఇంటి సమీపంలో ఉంటున్న అన్నదాసుల రామచంద్రరావు అనే వ్యక్తి.. తాను 10 ఏళ్లుగా గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్నానని.. చాలామందికి ఉద్యోగాలు ఇప్పించినట్లు నమ్మబలికాడు. రూ.5 లక్షలు ఇస్తే వారం రోజుల్లో కమల్కి జీహెచ్ఎంసీలో శానిటరీ వర్క్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు.
జీహెచ్ఎంసీలో ఉద్యోగం పేరుతో గుంటూరు వాసికి టోకరా - గుంటూరులో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగమన్నాడు. మాయమాటలతో నమ్మించాడు. రూ. 5 లక్షలు దోచేశాడు. నిలదీస్తే వాయిదాల పేరుతో కాలం వెళ్లదీస్తూ వచ్చాడు. తీరా మోసపోయామని గ్రహించిన ఆ బాధిత కుటుంబం.. పోలీసులను ఆశ్రయించింది. తమ సొమ్మును తిరిగి అప్పగించేలా చూడాలని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరింది. అసలేమైందంటే..?
కుమారుడి ఉద్యోగం కోసం తనకు ఆధారమైన ఇంటిని అమ్మేసి మిగిలిన డబ్బులు అప్పు తెచ్చి.. రూ.5 లక్షలు రామచంద్రరావుకి ఇచ్చింది. రోజులు గడుస్తున్నా రామచంద్రరావు ఉద్యోగం గురించి.. వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యాలయంలో గత ఏడాది 2019 లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని తెలిపింది. అనంతరం కొవిడ్ కారణంగా తాను పొలీస్ స్టేషన్ కి రాలేకపోయినట్లు దీయమ్మ చెప్పింది. ఈ మధ్య కాలంలో పెద్దల సమక్షంలో మాట్లాడితే... కేసులు వద్దని, రూ.5 లక్షలకు ప్రామిసరీ నోటు, రెండు ఖాళీ చెక్కులను రామచంద్రరావు ఇచ్చాడని తెలిపింది. అనంతరం డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన రూ.5 లక్షలను ఇప్పించాలని, నిందితుడు రామచంద్రరావుని కఠినంగా శిక్షించాలని బాధితురాలు విన్నవించింది.
ఇదీ చదవండీ: గిఫ్ట్ కార్డుల పేరుతో మోసం.. ఝార్ఖండ్ ముఠా అరెస్టు