తెలంగాణ

telangana

పాక్షిక అంధ విద్యార్థులకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేయూత

By

Published : Oct 5, 2020, 7:39 AM IST

ముగ్గురు పాక్షిక అంధ విద్యార్థులకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అండగా నిలిచారు. ఆన్​లైన్​ క్లాసులు వినేందుకు ఎలాంటి సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న ముగ్గురు విద్యార్థులు జేడీ ఫౌండేషన్​ను ఆశ్రయించారు. వారందరికి జేడీ ల్యాప్​టాప్​లు అందజేశారు.

jd foundation chairman vv lakshmninarayana donate looptops to three blind students
పాక్షిక అంధ విద్యార్థులకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేయూత

కరోనా కష్టకాలంలో ఆన్​లైన్ విద్యాబోధన తప్పనిసరైన పరిస్థితుల్లో స్మార్ట్​ఫోన్లు, ల్యాప్​టాప్​లు, ఇంట్లో టీవీలు లేక ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో ఈ ముగ్గురు విద్యార్థులు కూడా ఉన్నారు. పాక్షిక అంధత్వం ఉన్న ముగ్గురు విద్యార్థులు తాము ల్యాప్​టాప్ కొనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని జేడీ ఫౌండేషన్​ను ఆశ్రయించారు.

విద్యార్థుల ఇబ్బందిని అర్ధం చేసుకున్న జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ వి.వి.లక్ష్మీనారాయణ వారికి ఉచితంగా ల్యాప్​టాప్​లు అందజేశారు. ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు విద్య అని, దానికి ఆటంకం కలిగించకుండా తమ జేడీ ఫౌండేషన్ ఉంటుందని లక్ష్మీనారాయణ తెలిపారు. సాయం పొందిన వారు వృద్ధిలోకి వచ్చాక.. ఇలాగే మరికొందరిని ఆదుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ఇవీ చూడండి:క్రెడిట్‌ కార్డు సైజులో ఆధార్‌.. అప్లై ఇలా..

ABOUT THE AUTHOR

...view details