తెలంగాణ

telangana

ETV Bharat / city

బోసిపోయిన భాగ్యనగర రహదారులు - janatha curfew 2020

జనతా కర్ఫ్యూ ప్రభావం ఒక రోజు ముందుగానే రాష్ట్ర రాజధానిలో కనిపించింది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా తెరచి ఉండే వ్యాపార సముదాయాలు, దుకాణాలన్ని రాత్రి 10 గంటలకే మూతపడ్డాయి. ఎప్పుడు రద్దీగా ఉండే అమీర్​పేట రోడ్లన్ని నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.

janatha curfew
బోసిపోయిన భాగ్యనగర రహదారులు

By

Published : Mar 22, 2020, 6:46 AM IST

జనతా కర్ఫ్యూ ప్రభావం రాష్ట్ర రాజధానిలో స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే భాగ్యనగర రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. హాస్టల్​ వాసులతో రాత్రి 12 గంటల వరకు కిటకిటలాడే అమీర్​పేట్​, ఎస్ఆర్ నగర్​, ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలు పది గంటలకు ముందే మూతపడ్డాయి.

పంజాగుట్ట, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో రాత్రి పది దాటగానే దుకాణాలను బంద్ చేశారు. పాతబస్తీలో రాత్రి రెండు గంటల వరకు కొనసాగే వ్యాపార సముదాయాలు, హోటళ్లు 10 గంటలకే సర్దేశారు. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో రోడ్డు పక్కన తెల్లవారు జాము వరకు కొనసాగే టిఫిన్ బండ్లు కూడా ముందుగానే మూసివేశారు.

బోసిపోయిన భాగ్యనగర రహదారులు

ఇవీ చూడండి:రాష్ట్రంలో కరోనా రెండో దశ.. తొలి కాంటాక్ట్ కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details