తెలంగాణ

telangana

ETV Bharat / city

గాంధీభవన్​లో జైపాల్​రెడ్డి పార్థివదేహం... నేతల నివాళి

జైపాల్​రెడ్డి అంతిమయాత్ర గాంధీభవన్​కు చేరుకుంది. ఇక్కడ జైపాల్‌ రెడ్డి పార్థివదేహాన్ని కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. పలువురు సీనియర్ నేతలు.. నివాళులు అర్పిస్తున్నారు.

By

Published : Jul 29, 2019, 12:59 PM IST

Updated : Jul 29, 2019, 1:14 PM IST

gandhi bhavan

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్​రెడ్డి అంతిమయాత్ర గాంధీభవన్​కు చేరుకుంది. ఇక్కడ జైపాల్‌ రెడ్డి పార్థివదేహాన్ని గంటపాటు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, ఆజాద్‌, కుంతియా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, జానారెడ్డి, వీహెచ్​, డీసీసీ అధ్యక్షులు, పలువురు నేతలు నివాళులు అర్పించారు. కడసారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

నెక్లెస్‌రోడ్‌లోని పీవీ ఘాట్‌ సమీపంలో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

గాంధీభవన్​లో జైపాల్​రెడ్డి పార్థివదేహం... నేతల నివాళి

ఇదీ చూడండి: జైపాల్‌రెడ్డి మృతిపై పార్లమెంటు ఉభయసభల సంతాపం

Last Updated : Jul 29, 2019, 1:14 PM IST

For All Latest Updates

TAGGED:

jaipal reddy

ABOUT THE AUTHOR

...view details