కరోనా లాక్డౌన్, ఆన్లైన్ తరగతులు, వర్క్ ఫ్రం హోమ్ విధానంతో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా జూన్ 2020 నాటికి 55.41 శాతం మంది ప్రజలకు బ్రాడ్బ్యాండ్/ఇంటర్నెట్ కనెక్షన్లు ఉండగా సెప్టెంబరుకు అది 57.29 శాతంగా ఉంది. కనెక్షన్ల పరంగా చూస్తే ఇదే కాలానికి ఆ సంఖ్య 74.90 కోట్ల నుంచి 77.64 కోట్లకు చేరింది. కేవలం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ల వరకే తీసుకుంటే దేశవ్యాప్తంగా మార్చిలో 68.74 కోట్ల మంది వినియోగదారులు ఉండగా డిసెంబరు నాటికి వారి సంఖ్య 74.74 కోట్లు అయింది. దాదాపు తొమ్మిది శాతం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు పెరిగాయి.
- లాక్డౌన్ సడలింపులు మొదలైన తరువాత డేటా వినియోగం తగ్గింది.
- ఏప్రిల్ నుంచి జూన్ కాలానికి ఒక వ్యక్తి నెలవారీ డేటా వినియోగం సగటున 12.15 జీబీ ఉంటే... జులై నుంచి సెప్టెంబరు నాటికి అది 11.96 జీబీకి పరిమితమైంది.
- దేశవ్యాప్తంగా 96.92 శాతం మొబైల్ కనెక్షన్లకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది.