తెలంగాణ

telangana

By

Published : Aug 31, 2021, 10:39 AM IST

ETV Bharat / city

Ins airavat: కొవిడ్ సామగ్రితో వియత్నాం చేరిన ఐఎన్​ఎస్ ఐరావత్

భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఐరావత్ కొవిడ్ సామగ్రితో వియత్నాం చేరుకుంది. సాగర్ మిషన్​లో భాగంగా ఈ సామగ్రిని భారత్.. వియత్నాంకు పంపింది.

airavat
ఐరావత్

కొవిడ్ సామగ్రితో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఐరావత్ వియత్నాం సిటీ పోర్ట్​కు చేరింది. 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ 300 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను ఈ నౌక భారత్ నుంచి వియత్నాంకు జల రవాణా చేసింది. సాగర్ మిషన్లో భాగంగా ఈ సామగ్రిని భారత్ ఆ దేశానికి పంపింది.

దేశీయంగా తయారైన తూర్పు నౌకాధళానికి చెందిన ఐరావత్ విశాఖ నుంచి ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి కొవిడ్ సామగ్రి చేరవేస్తోంది. జకార్తాలో 10 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను అందించి.. అక్కడి నుంచి వియత్నాం చేరుకుంది.

ఇదీ చదవండి:IAS transfer: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్​ల బదిలీలు

ABOUT THE AUTHOR

...view details