తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి - Palem Srikanth Reddy died with Corona virus

కరోనా వైరస్ బారిన పడి ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కన్నుమూశారు. మధ్యాహ్నం హైదరాబాద్​లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

srikanth reddy
ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి

By

Published : Aug 12, 2020, 6:38 PM IST

Updated : Aug 12, 2020, 9:03 PM IST

ప్రముఖ పారిశ్రామిక వేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి కరోనాతో మృతి చెందారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్రీకాంత్ రెడ్డి గతంలో... తెదేపా నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు. రాజకీయాలకు అతీతంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చెన్నకేశవరెడ్డి కుమారుడైన శ్రీకాంత్ రెడ్డి... మోడరన్ రాయలసీమ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు.

Last Updated : Aug 12, 2020, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details