తెలంగాణ

telangana

ETV Bharat / city

'మరో రెండు, మూడు వారాల్లో సాధారణ పరిస్థితులు' - ఈటీవీ భారత్​తో ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్

కరోనా చికిత్సకు త్వరలో కొన్ని ఔషధాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఐఐసీటీ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. రెండు ఔషధాల ఉత్పత్తికి అవసరమైన ఏపీఐలను తయారు చేసి... ఫార్మా కంపెనీలకు ఇచ్చినట్లు చెప్పారు. శరీరంలోని వైరస్ లను నిర్మూలించే మరో రెండు ఔషధాలపై ఐఐసీటీలో పరిశోధనలు కొనసాగుతున్నాయని చెప్పారు. దేశంలో మరో రెండు, మూడు వారాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందంటున్న ఐఐటీసీ డైరెక్టర్ చంద్రశేఖర్​తో మా ప్రతినిధి నగేష్ చారి ముఖాముఖి...

iict director chandr shekar interview with etv bharat
'మరో రెండు, మూడు వారాల్లో సాధారణ పరిస్థితులు'

By

Published : Apr 22, 2020, 6:29 AM IST

Updated : Apr 22, 2020, 7:57 AM IST

'మరో రెండు, మూడు వారాల్లో సాధారణ పరిస్థితులు'

ప్ర: కొవిడ్​పై ప్రపంచమంతా యుద్ధం చేస్తుండగా.. అందులో కీలక పాత్ర పోషిస్తున్న ఐఐసీటీ పోషిస్తుంది. ఔషధాాలకు అవసరమైన ఏపీఐల విషయంలో ఎంత వరకు పరిశోధనలు వచ్చాయి?

జ: కొవిడ్​కి ప్రస్తుతం మందేమీ లేదు. యాంటీ వైరల్ డ్రగ్స్​ ఏమన్నా ఉపయోగించొచ్చా అని అన్ని దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఓ రెండు మూడు వినియోగించొచ్చని తేలింది. ప్రపంచమంతా క్లినికల్ ట్రయల్స్ జరుగుతన్నాయి. వేరే దేశం నుంచి డ్రగ్స్​కి ధర ఎక్కువ అవుతుంది. ఫలితంగా మనదేశంలోనే తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం.

ప్ర: అనుమతులకు, ఉత్పత్తి ప్రారంభానికి ఎంత సమయం పడుతుంది?

జ: ప్రస్తుత అత్యవసర పరిస్థితుల దృష్ట్యా రెగ్యులేటరీ అథారిటీ క్లినికల్ ట్రయల్స్​ లేకుండా అనుమతిస్తే 6-8 వారాల్లో 5-10 వేల టాబెట్లు తయారు చేస్తారు. 2నెలలు సమయంలో సుమారు 10 లక్షల టాబెట్లు తయారు చేసే సామర్థ్యం సిప్లాకు ఉంది.

ప్ర: ఇతర దేశాల్లో జరిగిన క్లినికల్ ట్రయల్స్ ప్రకారం వినియోగించుకునేలా.. మనకున్న చట్టాలు, నిబంధనలు ఏం చెబుతున్నాయి?

జ: రెగ్యూలేటరీ అథారిటీస్​.. వారి అధికారాలు, విచక్షణతో అత్యవసర పరిస్థితుల్లో క్లినికల్ ట్రయల్స్ లేకుండానే అనుమతిస్తాయని అనుకుంటున్నాం. ఎప్పుడైనా డిసీజ్​ని క్యూర్ చేసిందాని కంటే కూడా సైడ్​ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవడం ముఖ్యం.

ప్ర: ప్రస్తుతం వైద్యులు చెబుతున్నట్టు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఏ విధంగా సమర్థంగా పనిచేస్తుంది?

జ: 60, 70 ఏళ్ల క్రితం మలేరియా కోసం వ్యాక్సిన్​ కనుగొన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్​ రక్తంలోని హిమోగ్లోబిన్​లో బైండ్​ అవుతుందని బయాలజీ శాస్త్రవేత్తలు నిర్ధరించారు. కరోనా వైరస్ కూడా రక్తం ద్వారానే పోతుందుని సమాచారం ఉంది. విదేశీ శాస్త్రవేత్తలు క్లినికల్ ట్రయల్ చేశారు.

ప్ర: కరోనాను ఎదుర్కొనేందుకు నేరుగా చికిత్స అందించే ఔషధం రావడానికి ఎంత సమయం పట్టొచ్చు?

జ: వైరస్​ను కనుక్కొని తక్కువ సమయమే అవుతుంది. వ్యాక్సిన్​ కనుక్కొనేందుకు 12-16 నెలలు పట్టొచ్చని డబ్ల్యూహెచ్​వో చెబుతోంది. సంవత్సరంలోపే వస్తుందని చెప్పడం అత్యాశే అవుతుంది.

ప్ర: ఎప్పటిలోగా సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది?

జ: విపత్తు ఎక్కువ రోజులు ఉండదు. చైనాలో చూస్తున్నాం.. కేసుల సంఖ్య సున్నాకి వచ్చింది. బహుశా రెండు, మూడు వారాల్లో సాధారణ స్థితికి రావచ్చు.

ఇదీ చదవండి:'ఎవరూ ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచొద్దు'

Last Updated : Apr 22, 2020, 7:57 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details