ప్ర: కొవిడ్పై ప్రపంచమంతా యుద్ధం చేస్తుండగా.. అందులో కీలక పాత్ర పోషిస్తున్న ఐఐసీటీ పోషిస్తుంది. ఔషధాాలకు అవసరమైన ఏపీఐల విషయంలో ఎంత వరకు పరిశోధనలు వచ్చాయి?
జ: కొవిడ్కి ప్రస్తుతం మందేమీ లేదు. యాంటీ వైరల్ డ్రగ్స్ ఏమన్నా ఉపయోగించొచ్చా అని అన్ని దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఓ రెండు మూడు వినియోగించొచ్చని తేలింది. ప్రపంచమంతా క్లినికల్ ట్రయల్స్ జరుగుతన్నాయి. వేరే దేశం నుంచి డ్రగ్స్కి ధర ఎక్కువ అవుతుంది. ఫలితంగా మనదేశంలోనే తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం.
ప్ర: అనుమతులకు, ఉత్పత్తి ప్రారంభానికి ఎంత సమయం పడుతుంది?
జ: ప్రస్తుత అత్యవసర పరిస్థితుల దృష్ట్యా రెగ్యులేటరీ అథారిటీ క్లినికల్ ట్రయల్స్ లేకుండా అనుమతిస్తే 6-8 వారాల్లో 5-10 వేల టాబెట్లు తయారు చేస్తారు. 2నెలలు సమయంలో సుమారు 10 లక్షల టాబెట్లు తయారు చేసే సామర్థ్యం సిప్లాకు ఉంది.
ప్ర: ఇతర దేశాల్లో జరిగిన క్లినికల్ ట్రయల్స్ ప్రకారం వినియోగించుకునేలా.. మనకున్న చట్టాలు, నిబంధనలు ఏం చెబుతున్నాయి?
జ: రెగ్యూలేటరీ అథారిటీస్.. వారి అధికారాలు, విచక్షణతో అత్యవసర పరిస్థితుల్లో క్లినికల్ ట్రయల్స్ లేకుండానే అనుమతిస్తాయని అనుకుంటున్నాం. ఎప్పుడైనా డిసీజ్ని క్యూర్ చేసిందాని కంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవడం ముఖ్యం.