తెలంగాణ

telangana

ETV Bharat / city

ఐఏఎస్​ల బదిలీ.. ఉత్తర్వులు జారీ - కరీంనగర్​ కలెక్టర్​ బదిలీ

karimnagar collector transfer
karimnagar collector transfer

By

Published : Dec 16, 2019, 3:01 PM IST

Updated : Dec 16, 2019, 4:17 PM IST

14:59 December 16

ఐఏఎస్​ల బదిలీ.. ఉత్తర్వులు జారీ

    కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్​పై బదిలీ వేటు పడింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్​గా సర్ఫరాజ్​ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. శాసనసభ ఎన్నికల ఖర్చు విషయంలో భాజపా అభ్యర్థి బండి సంజయ్​తో ఆయన ఫోన్లో మాట్లాడినట్లు వచ్చిన ఆడియో టేపులు సంచలనం రేకెత్తించాయి. తనకు వ్యతిరేకంగా కలెక్టర్ వ్యవహరించారని మంత్రి గంగుల కమలాకర్ అప్పట్లో ఆరోపించారు. 

    ఈ విషయంలో సీఎస్ జోషిని కలిసి సర్ఫరాజ్ వివరణ ఇచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్ ను బదిలీ చేసిన ప్రభుత్వం... ఎక్సైజ్ కమిషనర్​గా నియమించింది. ఆయన స్థానంలో కరీంనగర్ కలెక్టర్​గా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంకను బదిలీ చేసింది. జోగులాంబ గద్వాల కలెక్టర్​గా వనపర్తి కలెక్టర్ శ్వేతా మహంతికి అదనపు బాధ్యతలు అప్పగించింది. 

    మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్​ల పోస్టింగుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్యకార్యదర్శిగా బూసాని వెంకటేశ్వరరావును బదిలీ చేసింది. ఇంటర్ ఫలితాల వివాదం తర్వాత వెయిటింగ్​లో ఉన్న అశోక్​ను మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్​గా నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి: త్వరలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాల ఏర్పాటు

Last Updated : Dec 16, 2019, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details