కరీంనగర్ జిల్లా శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ మొత్తం పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే దళితబంధు పథకం ప్రారంభోత్సవ వేదికపై కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జాను... సీఎంఓ సెక్రటరీగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
రాహుల్ బొజ్జా ఎస్సీ. వాళ్ల నాన్న బొజ్జా తారకం.. ఉద్యమంలో పనిచేసిన వారికి న్యాయవాదిగా ఉండే వారు. ఆయన కుమారుడే రాహుల్ బొజ్జా. రాహుల్ బొజ్జా ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉండటమే కాదు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో సెక్రటరీగా ఉండాలని నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారు.