తెలంగాణ

telangana

ETV Bharat / city

2018 లో నిఫాపై పోరు నేడు అనుభవంగా మారింది - కరోనాపై ఐఏఎస్ కృష్ణతేజ కామెంట్స్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కొన్ని దేశాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా... పాజిటివ్‌ కేసులు పెరగటం సహా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కానీ కరోనా కట్టడికి కేరళ తీసుకుంటున్న చర్యలు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది.

krishnateja
2018 లో నిఫాపై పోరు నేడు అనుభవంగా మారింది

By

Published : Apr 22, 2020, 8:11 AM IST

2018 లో నిఫాపై పోరు నేడు అనుభవంగా మారింది

భారత్‌ వంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో... కరోనా వ్యాప్తి నివారణ కత్తిమీద సాము లాంటిదే. అందుకే యావత్ ప్రపంచం.. భారత్‌ వైపు చూస్తోంది. ఇలాంటి తరుణంలో కేరళ కరోనా వైరస్‌ను తరమికొడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య కట్టడి చేస్తూనే... అక్కడి ప్రజలకు భరోసా ఇస్తోంది. కరోనా నియంత్రణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ప్రపంచ దేశాల దృష్టినీ ఆకర్షిస్తున్న కేరళ విజయం వెనక ప్రణాళికలను... ఆ రాష్ట్ర పర్యాటకశాఖ ఏడీజీ, యువ ఐఏఎస్​ కృష్ణతేజ... ఈటీవీ-భారత్​తో పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details