తెలంగాణ

telangana

By

Published : Feb 6, 2020, 6:27 PM IST

ETV Bharat / city

జేబీఎస్​-ఎంజీబీఎస్​ మెట్రో కారిడార్​ విశేషాలేంటి..

భాగ్యనగర మణిహారం రేపటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. రేపు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్​ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొత్తం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో ప్రజలకు అందుబాటులోకి రానుంది.

hyderabad metro second corridor inaugurated 7th feb
జేబీఎస్​-ఎంజీబీఎస్​ మెట్రో కారిడార్​ విశేషాలేంటి..

హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారిన మెట్రో రైలు ప్రాజెక్టులో మరో కీలక మార్గం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్​ను అనుసంధానం చేస్తూ 11 కిలోమీటర్ల పొడవునా నిర్మించారు. రేపు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో మొత్తం 69 కిలోమీటర్లు మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది.

2012లో రూ.14 వేల 132 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు 2017 జులై నాటికే పూర్తి కావాల్సి ఉంది. ఆస్తుల సేకరణ, కోర్టు కేసులు, అలైన్ మెంట్ వివాదాలతో జాప్యం జరిగింది. వాటన్నింటిని అధిగమించి మూడేళ్లు ఆలస్యంగా మూడు కారిడార్లను ఎల్ అండ్ టీ సంస్థ పూర్తి చేసింది.

జూబ్లీ బస్​స్టేషన్ నుంచి మహాత్మగాంధీ బస్​స్టేషన్ వరకు ప్రారంభం కానున్న మెట్రో కారిడార్​పై మరిన్ని విశేషాలు ఈటీవీ భారత్​ ప్రతినిధి మాటల్లో..

జేబీఎస్​-ఎంజీబీఎస్​ మెట్రో కారిడార్​ విశేషాలేంటి..

ఇవీచూడండి:జేబీఎస్​-ఎంజీబీఎస్​ మార్గం ఎందుకు ప్రత్యేకం..

ABOUT THE AUTHOR

...view details