గృహహింస, సైబర్ వేధింపులు, పోకిరీల వికృత చేష్టలతో.. మహిళలు, చిన్నారులు దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే కుటుంబ పరువుపోతుందని భయపడి వెనకడుగు వేస్తున్నారు. ఎవరిని, ఎక్కడ సంప్రదించాలో తెలియక మరికొంతమంది బాధితులు మిన్నకుండిపోతున్నారు. అన్యాయానికి గురైన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మహిళా భద్రతా విభాగం పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే షీటీంల ద్వారా యువతులు, మహిళలకు భరోసా కల్పిస్తున్న పోలీసులు.. ఇతర అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వల్ల చాలామంది యువతులు, మహిళలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉద్యోగాలు సైతం ఆన్లైన్లో ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. విద్యార్థులూ ఆన్లైన్ ద్వారానే పాఠాలు వింటున్నారు. దీంతో తెలియకుండానే కొందరు సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు.
సైబ్ హర్కు విశేష స్పందన..
సైబర్ వేధింపులకు గురికాకుండా యువతులు, మహిళలు, విద్యార్థినిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. "సైబ్ హర్" పేరిట నెల రోజులకు పైగా నిర్వహించిన ఆన్లైన్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు.
ఏడాది కాలంలో 119 ఫిర్యాదులు..