తెలంగాణ

telangana

ETV Bharat / city

Ap corona: ఏపీలోకొత్తగా 1, 869 కరోనా కేసులు.. 18 మరణాలు

గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,030 మందికి కరోనా పరీక్షలు (corona tests) నిర్వహించగా... కొత్తగా 1,869 కరోనా కేసులు, 18 మరణాలు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వైరస్ నుంచి మరో 2,316 మంది బాధితులు కోలుకున్నారు.

By

Published : Aug 11, 2021, 8:48 PM IST

CORONA CASES
కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,030 మందికి కరోనా పరీక్షలు (corona tests) నిర్వహించగా... కొత్తగా 1,869 కరోనా కేసులు, 18 మరణాలు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వైరస్ నుంచి మరో 2,316 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,417 కరోనా యాక్టివ్‌ కేసులు(corona active cases) ఉన్నాయి.

జిల్లాల వారీగా కరోనా మృతులు...

కరోనా కారణంగా చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, అనంతపురం, తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు...

తూర్పుగోదావరిలో 385, పశ్చిమగోదావరిలో 304, గుంటూరులో 222, నెల్లూరులో 177, చిత్తూరులో 175, కృష్ణాలో 148, కడపలో 133, ప్రకాశంలో 98, శ్రీకాకుళంలో 82, అనంతపురంలో 51, విశాఖపట్నంలో 63, విజయనగరంలో 21, కర్నూలులో 10 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: Covid: 5 రోజుల్లో 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details