తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కోరలు చాస్తోన్న కరోనా.. కొత్తగా 947 కేసులు - ap corona cases

ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రవ్యాప్తంగా 947 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, కొవిడ్ టీకా తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.

ap corona cases
ఏపీ కరోనా వార్తలు

By

Published : Mar 27, 2021, 9:31 PM IST

ఏపీ కరోనా బులిటెన్​

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 947 మంది కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 8,97,810కి పెరిగింది. వైరస్​ నుంచి 377 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,715 క్రియాశీల కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా నమోదైన కేసులు

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 180 మందికి, విశాఖలో 156, గుంటూరులో 145, కృష్ణాలో 113 మందికి కరోనా సోకినట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. అనంతపురంలో 35, తూర్పుగోదావరిలో 58, కడపలో 40, కర్నూలులో 61 మందికి, నెల్లూరులో 43, ప్రకాశం 23, శ్రీకాకుళంలో 56, విజయనగరంలో 19, పశ్చిమ గోదావరిలో 18 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:కరోనా వ్యాప్తి దృష్ట్యా పండుగలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం

ABOUT THE AUTHOR

...view details