తెలంగాణ పోలీస్ శాఖ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని.. అందుకే సీఎం పోలీస్ శాఖకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, డీజీపీ మహేందర్రెడ్డి, సీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. అధునాతన సౌకర్యాలతో కమాండ్ అండ్ కంట్రోల్ రూం నిర్మాణం జరుగుతోందన్నారు.
టెక్నాలజీని ఉపయోగించడంలో తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసుల కంటే ముందు వరుసలో ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కొనియాడారు. హైదరాబాద్లో నేరాల శాతం తగ్గిందని వివరించారు. పాతబస్తీలో ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని.. అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నారని ఆయన వివరించారు.