తెలంగాణ

telangana

ETV Bharat / city

'వ్యాపార రంగంలో మహిళలు రాణించాలి'

వ్యాపార రంగంలో మహిళలు రాణించాలన్నారు మహిళ జాగృతి స్వచ్ఛంద సంస్థ నిర్వహకులు. ఆసంస్థ ఆధ్వర్యంలో గృహోపకరణాల 19వ మేళాను అబిడ్స్​లో ప్రారంభించారు. ఈ మేళా మూడు రోజులపాటు కొనసాగుతోందని తెలిపారు.

By

Published : Jul 19, 2019, 10:24 PM IST

'వ్యాపార రంగంలో మహిళలు రాణించాలి'

వ్యాపార రంగంలో మహిళలు రాణించాలన్నారు మహిళ జాగృతి స్వచ్ఛంద సంస్థ నిర్వహకులు. ఆసంస్థ ఆధ్వర్యంలో గృహోపకరణాల 19వ మేళాను అబిడ్స్​ ఫంక్షన్​ హాల్​లో ప్రారంభించారు. దాదాపు 100 స్టాల్​లతో ఏర్పాటు చేసిన ఈ మేళా మూడు రోజుల పాటు కొనసాగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మహిళలు స్వతహాగా ఇంటి వద్ద తయారుచేసిన వివిధ వస్తువులను ఈ మేళాలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో గృహ అలంకరణ వస్తువులు, రాఖీలు, దుస్తువులు, ఆభరణాలు తదితర వస్తువులు ఉన్నాయి. మహిళ సాధికారత కోసం, వారి వ్యాపారానికి ఒక వేదిక ఏర్పాటు చేయడమే మహిళ జాగృతి ఉద్దేశం అన్నారు. గత 22 ఏళ్లుగా మహిళలలో ఉన్న వ్యాపార నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొస్తూ... ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేలా చేయుతను ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

'వ్యాపార రంగంలో మహిళలు రాణించాలి'

For All Latest Updates

TAGGED:

melawomen

ABOUT THE AUTHOR

...view details