తెలంగాణ

telangana

ETV Bharat / city

'కొత్తేడాదిలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలి' - sky ways in hyderabad

కొత్త ఏడాదిలో హెచ్​ఎండీఏ ప్రత్యేక కార్యాచరణతో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని కమిషనర్​ అర్వింద్​కుమార్​ అధికారులకు సూచించారు. గతేడాదిలో కొవిడ్ కారణంగా అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ వాటిని అధిగమించి ఈ ఏడాదిలో పురోగతిని సాధించాలని అధికారులను ఆదేశించారు.

hmda commissioner arvind kumar on sky way works in uppal and mehdipatnam
hmda commissioner arvind kumar on sky way works in uppal and mehdipatnam

By

Published : Jan 2, 2021, 4:49 PM IST

నిర్దిష్ట కాలపరిమితిలో ఉప్పల్​ స్కైవే, మెహదీపట్నం స్కైవే నిర్మాణ పనులు పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ ఆదేశించారు. ఉప్పల్ స్కైవే 3డీ మోడల్​ను ఆయన పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కొత్త ఏడాది హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్ అథారిటీ ప్రత్యేక కార్యాచరణతో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

హెచ్​ఎండీఏ ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో అర్వింద్ కుమార్ సమావేశం నిర్వహించారు. గతేడాదిలో కొవిడ్ కారణంగా అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ వాటిని అధిగమించి ఈ ఏడాదిలో పురోగతిని సాధించాలని అధికారులకు సూచించారు. హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.

ఇదీ చూడండి: కేసీఆర్ ఫోన్: నాగిరెడ్డి పంటెట్టున్నది... విత్తనాలు ఎక్కడ తెచ్చినవ్!

ABOUT THE AUTHOR

...view details