న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై ప్రభుత్వ అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం, ఉదాసీనతపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఎలా అమలు చేయాలో నేర్చుకుంటారా? లేదంటే మమ్మల్ని నేర్పమంటారా? అంటూ అడ్వొకేట్ జనరల్ను ఉద్దేశించి ప్రశ్నించింది. ఓ కోర్టు ధిక్కరణ పిటిషన్పై అప్పీలు దాఖలు చేయడంలో జరిగిన జాప్యానికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు హెచ్చరించింది. సంబంధిత పిటిషన్లో జాప్యం జరిగిన ప్రతి రోజుకూ కారణాలు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఒక న్యాయమూర్తి ఎదుటే 800...
‘‘హైకోర్టులో రెండు వేలకు పైగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు అపరిష్కృతంగా ఉన్నాయి. ఒక న్యాయమూర్తి ఎదుటే 800 దాకా ఉన్నాయి. ఈ తరహా పిటిషన్లు ఇన్ని దాఖలవుతుండటం ఆశ్చర్యంగా ఉంది. ఎవరూ సరదాకి వాటిని దాఖలు చేయరు. ఇందు కోసం న్యాయవాదిని నియమించుకోవాలి. అతనికి రుసుము చెల్లించాలి. ఈ పరిస్థితి చూస్తుంటే కోర్టు ఉత్తర్వులను అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారని, అగౌరవపరుస్తున్నారనే భావన కలుగుతోంది. ఒకరిద్దర్ని జైలుకు పంపితే తప్ప పరిస్థితులు చక్కబడేలా లేవు. న్యాయస్థానాలను గౌరవించడాన్ని మీరు నేర్పించడం ప్రారంభిస్తారో? లేదంటే మేమే నేర్పించాలో చెప్పాలి’’ అని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ‘‘
ధర్మాసనం అసంతృప్తి...