తెలంగాణ

telangana

ETV Bharat / city

"సచివాలయం, ఎర్రమంజిల్​ భవనాలు కూల్చవద్దు" - highcourt ordered telangana government that do not demolish the secretariat and irummanjil buildings

న్యాయస్థానంలో వ్యాజ్యాలు పెండింగ్​లో ఉన్నందున సచివాలయం, ఎర్రమంజిల్​ భవనాలను కూల్చవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హామీ ఇవ్వాలని కోరింది.

"సచివాలయం, ఎర్రమంజిల్​ భవనాలు కూల్చవద్దు"

By

Published : Jul 8, 2019, 2:42 PM IST

నూతన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​ఎస్​ చౌహాన్​ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేసేందుకు పదిహేను రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్​ జనరల్​ కోరారు. విచారణ పెండింగ్​లో ఉన్నంతవరకు భవనాలు కూల్చవద్దని అభిప్రాయపడిన ఉన్నత న్యాయస్థానం ఆ మేరకు హామీ ఇవ్వాలని సూచించింది. ఈరోజు మధ్యాహ్నమే వాదనలు వినిపిస్తామని అదనపు ఏజీ పేర్కొనగా... హైకోర్టు అంగీకరించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details