తెలంగాణ

telangana

By

Published : Aug 27, 2020, 4:25 PM IST

Updated : Aug 27, 2020, 8:31 PM IST

ETV Bharat / city

ప్రభుత్వ భూమిని తితిదే ఆక్రమించినట్లు కనిపిస్తోంది: హైకోర్టు

ప్రభుత్వ భూమిని తితిదే ఆక్రమించినట్లు కనిపిస్తోంది: హైకోర్టు
ప్రభుత్వ భూమిని తితిదే ఆక్రమించినట్లు కనిపిస్తోంది: హైకోర్టు

16:23 August 27

ప్రభుత్వ భూమిని తితిదే ఆక్రమించినట్లు కనిపిస్తోంది: హైకోర్టు

ఖమ్మంలో తితిదే కల్యాణ మండపం భూవివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి అల్లిక అంజయ్య వేసిన పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. తితిదేకు చెందిన 12 గుంటల భూమిని వెనక్కి తీసుకుంటున్నారని పిటిషనర్ ఆరోపించగా.. దేవస్థానం ఆధీనంలోనే 12 గుంటలు అదనంగా ఉందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పక్క భూమిని కూడా తితిదే ఆక్రమించే యత్నం చేస్తోందని ఖమ్మం కార్పొరేషన్ వాదనలు వినిపించగా.. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనుమానాస్పదంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.  

భూమి వెనక్కి తీసుకుంటే తితిదే ఎందుకు స్పందించడం లేదు? ప్రజా ప్రయోజన వ్యాజ్యం వెనుక తితిదే ఉండొచ్చు! ప్రభుత్వ భూమిని తితిదే ఆక్రమించినట్లు కనిపిస్తోంది. దేవుడి పేరిట భూములు ఆక్రమించరాదు. దేవుడు కూడా చట్టానికి అతీతం కాదు: హైకోర్టు

భూమికి సంబంధించిన దస్త్రాలు, పట్టాలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. విచారణను సెప్టెంబరు 8కి వాయిదా వేసింది.

ఇవీ చూడండి:వేతనలు, పింఛను కోతపై విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా

Last Updated : Aug 27, 2020, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details