తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో ప్రకటనల కేసు: కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - ap hc news

పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అధికార పార్టీకి చెందిన పత్రికకు 52 శాతం ప్రకటనలు ఇస్తున్నారని సామాజిక కార్యకర్త నాగశ్రవణ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

news on government adds
ఏపీలో ప్రకటనల కేసు

By

Published : Sep 4, 2020, 5:13 PM IST

పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలపై ఆంధ్రప్రదేశ్​ హైకోర్టులో విచారణ జరిగింది. అధికార పార్టీకి చెందిన పత్రికకు 52 శాతం ప్రకటనలు ఇస్తున్నారని సామాజిక కార్యకర్త నాగశ్రవణ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్​ను తెలుగుదేశం పార్టీ వారే వేయించారని .. పిల్‌ను తిరస్కరించాలని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.

సర్క్యులేషన్ ప్రకారం ప్రకటనలు ఇవ్వట్లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. పార్టీ రంగులతో ప్రకటనలు ఇవ్వడం సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలకు విరుద్ధం అని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.‌ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధంగా ఉందని అన్నారు.

ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

భవిష్యత్తులో వ్యవసాయం బంగారమయం: నాబార్డ్‌ ఛైర్మన్‌

ABOUT THE AUTHOR

...view details