పెద్దపల్లి జిల్లా కలవచర్లలో న్యాయవాద దంపతుల హత్యకు కారకులైన దోషులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సంఘటనకు నిరసనగా గురువారం హైకోర్టులో విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది.
నేడు హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసన - telangana latest news
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా హైకోర్టు బార్ అసోసియన్ విధులు బహిష్కరించాలని నిర్ణయించింది. నిందితులను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఒక ప్రకటనలో పేర్కొంది.

నేడు హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసన
వామన్రావు దంపతుల హత్యను తెలంగాణ బార్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. న్యాయవాదులపై ఇటీవల దాడులు ఎక్కువవుతున్నాయని, వారి రక్షణకు చట్టాన్ని తీసుకురావాలని కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి:న్యాయవాద దంపతుల హత్యకు... వాధించిన కేసులే కారణమా?