ఏపీలో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో మున్నేరు పొంగిపొర్లుతోంది. నదిలో నీటి ప్రవాహం లక్ష క్యూసెక్కులకు పెరగటంతో కృష్ణాజిల్లాలోని లింగాల, పెనుగంచిప్రోలు వంతెనపై నుంచి ప్రవాహం ఉద్ధృతి కొనసాగుతోంది. వత్సవాయి మండలంలోని లింగాల, ఆలూరుపాడు, పెనుగంచిప్రోలు మండలంలోని ముచ్చింతల, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు గ్రామాల్లో వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు-అక్కపాలెం రహదారిలో పడమటి వాగు వంతెన పైనుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
కృష్ణా జిల్లా నందిగామ మండలం పల్లగిరి కొండ వద్ద...... కూచివాగు వరదలో చిక్కుకున్న రైతులను ఎన్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. పల్లగిరి, మాగల్లు గ్రామాల మధ్య మామిడి తోటలో చిక్కుకుపోయిన ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భారీ వర్షాలతో కర్నూలులో రహదారులు జలమయం అయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వాన నీరు చేరడంతో చికిత్స కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. కుండపోత వర్షంతో అనకాపల్లి శారదా నది.. జలకళ సంతరించుకుంది. అరకులోయ మండలంలో ఉన్న బొండాం కొత్తవలస, ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం, బుంగాపుట్టు గ్రామాల మధ్య ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు అవతల ఉన్న 18 గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.
గుంటూరులో..